చినారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభ
కార్యాల్లో పాల్గొన్న పెద్దదిష్టిని లకీ, పిల్లలకీ
విభిన్నపద్ధతులలో తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు
సాధించినప్పుడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు
అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టి తీస్తారు. అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపినా నీతితో దిష్టి తీస్తుంటారు. బయటజనుల
దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టితీస్తే చిన్నపిల్లవాడు కలవరింతలు లేకుండా
నిద్రపోవటమూ, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం
వంటి అవలక్షణాలు లేకుండా ఉంటాడు.
చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చూ అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల చుట్టూ అంతా
చేరటంవల్ల చిన్నపిల్లలూ లేదా పెద్దలూ కోంత అస్వస్థతకు గురిఅవుతారు. అందుకే
వివాహవేడుకలలోను, పుట్టిన రోజువేడుకలలోను
విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళలో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదేపదే చూడటం
వల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతతోపాటు ధైర్య గుణంవస్తుంది.